భాగోతం బ‌య‌ట‌ప‌డింది.... ప‌ద‌వి ఊడింది!

ఢిల్లీ ప్ర‌భుత్వంలో ఓ మంత్రి బూతు భాగోతం బ‌య‌ట‌ప‌డింది. దీంతో సీఎం కేజ్రీవాల్ అత‌న్ని ప‌ద‌వి నుంచి పీకిపాడేశాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సీఎం కార్యాల‌యానికి ఓ సీడీ వ‌చ్చింది. దాదాపు 9నిమిషాలు నిడివి ఉన్న ఆ సీడీలో ఢిల్లీ మంత్రివ‌ర్గంలో అతిపిన్న వ‌య‌స్కుడిగా పేరొందిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సందీప్‌కుమార్ ఉన్నాడు. ఉండ‌ట‌మంటే మామూలుగా ఉండ‌టం కాదు.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో స‌ర‌స స‌ల్లాపాల‌లో మునిగిపోయాడు. ఇది సీఎం కార్యాల‌యానికి చేరే ముందే ఢిల్లీలోని అన్ని టీవీ […]

Advertisement
Update: 2016-08-31 22:15 GMT

ఢిల్లీ ప్ర‌భుత్వంలో ఓ మంత్రి బూతు భాగోతం బ‌య‌ట‌ప‌డింది. దీంతో సీఎం కేజ్రీవాల్ అత‌న్ని ప‌ద‌వి నుంచి పీకిపాడేశాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సీఎం కార్యాల‌యానికి ఓ సీడీ వ‌చ్చింది. దాదాపు 9నిమిషాలు నిడివి ఉన్న ఆ సీడీలో ఢిల్లీ మంత్రివ‌ర్గంలో అతిపిన్న వ‌య‌స్కుడిగా పేరొందిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సందీప్‌కుమార్ ఉన్నాడు. ఉండ‌ట‌మంటే మామూలుగా ఉండ‌టం కాదు.. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో స‌ర‌స స‌ల్లాపాల‌లో మునిగిపోయాడు. ఇది సీఎం కార్యాల‌యానికి చేరే ముందే ఢిల్లీలోని అన్ని టీవీ చాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మైంది. ఇది చూసిన వెంట‌నే కేజ్రీవాల్ స్పందించారు. అత‌న్ని ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ట్వీట్ చేసి మ‌రోసారి త‌న నిజాయ‌తీని చాటుకున్నారు. నీతికి, నిజాయితీకి త‌మ పార్టీ మారు పేరు అని, నీతి తప్పిన వారెవ‌రికీ పార్టీలో చోటు లేద‌ని స్ప‌ష్టం చేశారు. అక్ర‌మమార్గాల్లో ఉన్న వారు ఏ స్థాయిలో ఉన్నా.. వారిని పార్టీ లెక్క‌చేయ‌ద‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న‌డానికి సందీప్ ఉదంత‌మే నిద‌ర్శ‌న‌మని కేజ్రీ తెలిపాడు.

సందీప్ కుమార్ మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో త‌న‌ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన‌ ఓ ర‌హ‌స్యం చెప్పాడు. తాను ప్ర‌తిరోజు ఉద‌యం నిద్ర‌లేవ‌గానే.. త‌న భార్య పాదాలు తాకుతాన‌ని మీడియాకు వెల్ల‌డించారు. భార్య‌ను తానెంత‌గా ప్రేమిస్తున్న‌ది, స్ర్తీలంటే త‌న‌కెంత గౌర‌వం ఉందో గొప్ప‌లు చెప్పుకున్న సందీప్ ఇలాంటి నీచ‌మైన ప‌నిద్వారా ప‌ద‌వి పోగొట్టుకోవ‌డం ఢిల్లీలో చ‌ర్చానీయాంశంగా మారింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News