మా కుమార్తె మళ్లీ మళ్లీ రేప్కి గురవుతున్నట్టుగా ఉంది " నిర్భయ తల్లిదండ్రులు
అత్యంత దారుణమైన నిర్భయ ఘటన కేసు విచారణ విషయంలో కోర్టుల్లో జరుగుతున్న జాప్యంపై నిర్భయ తల్లిదండ్రులు బద్రినాథ్ సింగ్, ఆశాదేవి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసి శిక్షలు విధించినపుడే సమాజంలో ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఉంటాయని, చట్టమంటే భయముంటుందని వారు అన్నారు. హైదరాబాద్లో హర్ ఇండియా కాన్ఫరెన్స్-2016లో వారు పాల్గొన్నారు. కింది కోర్టులు దోషులకు మరణ శిక్ష విధించిన తరువాత కూడా సుప్రీంకోర్టులో ఈ కేసు రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉందని […]
అత్యంత దారుణమైన నిర్భయ ఘటన కేసు విచారణ విషయంలో కోర్టుల్లో జరుగుతున్న జాప్యంపై నిర్భయ తల్లిదండ్రులు బద్రినాథ్ సింగ్, ఆశాదేవి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసి శిక్షలు విధించినపుడే సమాజంలో ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఉంటాయని, చట్టమంటే భయముంటుందని వారు అన్నారు. హైదరాబాద్లో హర్ ఇండియా కాన్ఫరెన్స్-2016లో వారు పాల్గొన్నారు. కింది కోర్టులు దోషులకు మరణ శిక్ష విధించిన తరువాత కూడా సుప్రీంకోర్టులో ఈ కేసు రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉందని వారు పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని…ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ విషయంపై ఏ మాత్రం ప్రస్తావించలేదని బద్రినాథ్ అన్నారు.
జరిగిందేదో జరిగిపోయింది…కానీ నాలుగున్నరేళ్ల తరువాత కూడా ఈ కేసు ఇంకా నడుస్తోంది…లాయర్లు ఇంకా దీనిపై తమ వాదనలు వినిపిస్తున్నారు…ఇదంతా చూస్తుంటే మా కుమర్తె మళ్లీ మళ్లీ రేప్కి గురవుతున్నట్టుగా ఉందని నిర్భయ తండ్రి ఆవేదన చెందారు. ఈ దేశంలో మహిళల పట్ల జరుగుతున్న నేరాలు అందరికీ తెలుసునని, అసలు న్యాయమనేది ఉందో లేదో సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే తెలుస్తుందని ఆయన అన్నారు.
ఈ రోజుకి కూడా జనం ఆలోచనల్లో మార్పు రాలేదని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ఇప్పటికీ అత్యాచారాల విషయంలో బాధితులనే నిందిస్తున్నారని…నేరస్తులు జైలుకి వెళ్లి హాయిగా బయటకు వచ్చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారని, బాధితుల కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయని వాపోయారామె.
Click on Image to Read: