చంద్రబాబు ఒక రాచపుండు... అదంతా కాస్మోటిక్ సర్జరీ

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రచారం, హుంగుఆర్భాటాలు తప్ప ఏమీ ఉండడం లేదన్నారు. ప్రతిదానిని ప్రచారం కోసం వాడుకోవడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. పుష్కరాలు మొదలుకుని సింధు వరకూ ప్రతి అంశాన్ని తన సొంత ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రచారం బాగా ఉంటుందని భావిస్తే కృష్ణాష్టమిలోనూ ఉట్టికొట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఒక రాచపుండులా తయారైందన్నారు. చంద్రబాబు పాలనలో గోదావరి జిల్లాలకు […]

Advertisement
Update: 2016-08-24 03:07 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రచారం, హుంగుఆర్భాటాలు తప్ప ఏమీ ఉండడం లేదన్నారు. ప్రతిదానిని ప్రచారం కోసం వాడుకోవడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. పుష్కరాలు మొదలుకుని సింధు వరకూ ప్రతి అంశాన్ని తన సొంత ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రచారం బాగా ఉంటుందని భావిస్తే కృష్ణాష్టమిలోనూ ఉట్టికొట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఒక రాచపుండులా తయారైందన్నారు.

చంద్రబాబు పాలనలో గోదావరి జిల్లాలకు కూడా నీరు లేని పరిస్థితి దాపురించిందన్నారు. అనంతపురం, చిత్తూరు,కర్నూలు జిల్లాల్లో వేరుశెనగ రైతుల పంట ఎండి అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా సంబరాలుచేసుకుంటున్నారని విమర్శించారు. 12 రోజుల పాటు పాలనను గాలికి వదిలేసి పుష్కరాలతో గడిపేసిన చంద్రబాబు… ప్రజాసమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని మాత్రం ఐదు రోజులే సమావేశపరుస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో వ్యవహరించే తీరు బయటి ప్రపంచానికి తెలిసేందుకు గాను పుష్కరాలకు హాజరైన పెద్దలందరినీ అసెంబ్లీ సమావేశాల వీక్షణకు ఆహ్వానించాలని చంద్రబాబును కోరారు. ఏపీ పరిస్థితిని మేడిపండులాగా మార్చేశారని విమర్శించారు. మార్కెటింగ్‌ ప్రతిభతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రానికి మార్కెటింగ్ కాస్మోటిక్ సర్జరీ చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు భూమన. చంద్రబాబు మరో వంద పుష్కరాల్లో మునిగినా ఆయన చేసిన పాపాలు పోవన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News