అచ్చెన్నకు తెలుసు " నయీంతో లింకులను బయటపెట్టిన నట్టికుమార్

సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నయీంతో టాలీవుడ్‌కు లింకులున్నాయని వెల్లడించారు. సి. కల్యాణ్, అశోక్‌ కుమార్, బండ్ల గణేష్‌, సచిన్‌ జోషిలకు నయీంతో సంబంధాలున్నాయని చెప్పారు. నయీంకు కొంతమంది సినీ పెద్దలు కూడా సహకరించారని ఆరోపించారు. త్వరలోనే ఆ వివరాలన్నీ సాక్ష్యాలతో సహా సిట్‌కు అందజేస్తానన్నారు. థియేటర్లలో క్యాంటిన్ వ్యాపారం మొత్తం నయీం చేతుల్లోనే ఉందన్నారు. కృష్ణ, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో క్యాంటిన్ వ్యాపారం మొత్తం నయీం చేతుల్లోనే ఉందన్నారు. నర్సంపేటలోని తన థియేటర్‌ను […]

Advertisement
Update: 2016-08-22 03:18 GMT

సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నయీంతో టాలీవుడ్‌కు లింకులున్నాయని వెల్లడించారు. సి. కల్యాణ్, అశోక్‌ కుమార్, బండ్ల గణేష్‌, సచిన్‌ జోషిలకు నయీంతో సంబంధాలున్నాయని చెప్పారు. నయీంకు కొంతమంది సినీ పెద్దలు కూడా సహకరించారని ఆరోపించారు. త్వరలోనే ఆ వివరాలన్నీ సాక్ష్యాలతో సహా సిట్‌కు అందజేస్తానన్నారు. థియేటర్లలో క్యాంటిన్ వ్యాపారం మొత్తం నయీం చేతుల్లోనే ఉందన్నారు. కృష్ణ, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో క్యాంటిన్ వ్యాపారం మొత్తం నయీం చేతుల్లోనే ఉందన్నారు. నర్సంపేటలోని తన థియేటర్‌ను నయీం అనుచరులు బలవంతంగా లాక్కున్నారని నట్టికుమార్ చెప్పారు. కోటి రూపాయల విలువ చేసే థియేటర్‌ను కేవలం రూ. 25లక్షలు ఇచ్చి లాక్కున్నారని చెప్పారు. ఈ విషయంపై ఏపీ పోలీసులతో పాటు మంత్రి అచ్చెన్నాయుడును కలిసి చెప్పానన్నారు. అయినా సరే అచ్చెన్నాయుడు పట్టించుకోలేదని నట్టికుమార్ వెల్లడించారు. నయీంతో చాలా మందికి సంబంధాలున్నాయన్నారు నట్టికుమార్. నయీంను పోలీసులు మట్టుబెట్టిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా ధైర్యం చేసి ముందుకొస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News