కుమారస్వామి, పవన్ భేటీ... సరైన సమయంలో స్పందిస్తా...

కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి నటుడు పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చారు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని పవన్ చెప్పారు. తాను కుమారస్వామి స్నేహితులమన్నారు. ఎనిమిదేళ్లుగా తమ మధ్య స్నేహం ఉందన్నారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా, పుష్కరస్నానంపై మీడియాప్రతినిధులు పవన్‌ను ప్రశ్నించారు.  ప్రత్యేక హోదాపై సరైన సమయంలో స్పందిస్తానని పవన్ చెప్పారు. కృష్ణా పుష్కర స్నానం చేసేందుకు వెళ్లడం లేదన్నారు. తన కుమారుడు నిఖిల్‌ సినిమాకు సంబంధించి సలహాలు, ఆశీర్వాదం తీసుకునేందుకు పవన్‌ను కలిశానని […]

Advertisement
Update: 2016-08-20 02:08 GMT

కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి నటుడు పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చారు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని పవన్ చెప్పారు. తాను కుమారస్వామి స్నేహితులమన్నారు. ఎనిమిదేళ్లుగా తమ మధ్య స్నేహం ఉందన్నారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా, పుష్కరస్నానంపై మీడియాప్రతినిధులు పవన్‌ను ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై సరైన సమయంలో స్పందిస్తానని పవన్ చెప్పారు. కృష్ణా పుష్కర స్నానం చేసేందుకు వెళ్లడం లేదన్నారు. తన కుమారుడు నిఖిల్‌ సినిమాకు సంబంధించి సలహాలు, ఆశీర్వాదం తీసుకునేందుకు పవన్‌ను కలిశానని కుమారస్వామి చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News