ఎన్నికల సమయంలో దారుణం.. హోం మంత్రిపై దాడికి యత్నం

హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని విశ్రాంతి తీసుకోడానికి మాజీ జడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి.

Advertisement
Update: 2024-05-08 04:06 GMT

సాక్షాత్తూ హోం మంత్రిపై దాడి చేసేందుకు రాజకీయ వైరి వర్గాలు ప్రయత్నించాయంటే ఏపీలో ఎన్నికల కమిషన్ చేతిలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హడావిడిగా ఏపీ డీజీపీని మార్చేసి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే భ్రమ కల్పించారు టీడీపీ నేతలు. కక్షగట్టినట్టుగా పోలీస్ అధికారులను బదిలీలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా హోం మంత్రి తానేటి వనితపై దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించడం సంచలనంగా మారింది.

మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు ఈ దాడికి తెగబడ్డాయని తెలుస్తోంది. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని విశ్రాంతి తీసుకోడానికి మాజీ జడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. వైసీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోగా కొందరు టీడీపీ కార్యకర్తలు మంత్రి తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు. వెంటనే ఆమె సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. ఆ ఇంటి బయట అల్లరిమూకలు రెచ్చిపోయాయి.

వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద వాహనాలను ధ్వంసం చేశారు, ఇంట్లో ఫర్నిచర్‌ ను విరగ్గొట్టారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలను కూడా గాయపరిచారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. నల్లజర్లలో భారీగా పోలీసులు మోహరించారు. సాక్షాత్తూ హోం మంత్రిపై దాడి చేయాలనే ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News