పరిటాల అనుచరుల దారుణహత్య

అనంతపురం టీడీపీలో వర్గవిభేదాలు హత్యలు చేసుకునే స్థాయికి  చేరాయి. పరిటాల కుటుంబానికి అనుచరులుగా ఉన్న ఇద్దరిని ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. అనంతపురం నగర శివారు రుద్రంపేట  చంద్రబాబుకొట్టాల్లో ఈ దాడి జరిగింది. మృతులు పరిటాల అనుచరులైన గోపినాయక్‌, వెంకటేశ్‌ నాయక్‌. వీరిని వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. బైక్ పై వెళ్తుండగా ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో నరికారు. వీరికి టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో చాలా కాలంగా విభేదాలున్నాయి. మృతులపై గతంలోనూ మూడు సార్లు హత్యాయత్నం జరిగింది. […]

Advertisement
Update: 2016-07-21 03:44 GMT

అనంతపురం టీడీపీలో వర్గవిభేదాలు హత్యలు చేసుకునే స్థాయికి చేరాయి. పరిటాల కుటుంబానికి అనుచరులుగా ఉన్న ఇద్దరిని ప్రత్యర్థులు దారుణంగా చంపేశారు. అనంతపురం నగర శివారు రుద్రంపేట చంద్రబాబుకొట్టాల్లో ఈ దాడి జరిగింది. మృతులు పరిటాల అనుచరులైన గోపినాయక్‌, వెంకటేశ్‌ నాయక్‌. వీరిని వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. బైక్ పై వెళ్తుండగా ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో నరికారు. వీరికి టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో చాలా కాలంగా విభేదాలున్నాయి. మృతులపై గతంలోనూ మూడు సార్లు హత్యాయత్నం జరిగింది.

తమను హత్య చేసేందుకు స్వయంగా ప్రభాకర చౌదరియే కుట్రపన్నారంటూ ఇటీవల పరిటాల సునీతను కలిసి వారు వివరించినట్టు తెలుస్తోంది. ప్రభాకర్‌ చౌదరి ఆగడాల నుంచి తమను మీరే కాపాడాలని మంత్రి సునీతను వేడుకున్నట్టు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే గోపినాయక్, వెంకటేష్‌ నాయక్‌ హత్యలు జరగడం కలకలం రేపుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News