రమ్య ఇంటిలో మరో విషాదం

ఇటీవల హైదరాబాద్ పంజాగుట్టలో కొందరు యువకులు మద్యంమత్తులో కారు నడిపి ఒక కుటుంబాన్ని చిద్రం చేశారు. ప్రమాదంలో మధుసూదనాచారి కుటుంబం తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలతో తొమ్మిది రోజుల పాటు చికిత్స పొందుతూ చిన్నారి రమ్య చనిపోయింది. ఆమె తాత మధుసూదనా చారి వెన్నుముకతో పాటు పక్కటెముకలు విరిగాయి. దీంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రమాదం సమయంలో పాప పక్కనే కూర్చున్న […]

Advertisement
Update: 2016-07-18 00:12 GMT

ఇటీవల హైదరాబాద్ పంజాగుట్టలో కొందరు యువకులు మద్యంమత్తులో కారు నడిపి ఒక కుటుంబాన్ని చిద్రం చేశారు. ప్రమాదంలో మధుసూదనాచారి కుటుంబం తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలతో తొమ్మిది రోజుల పాటు చికిత్స పొందుతూ చిన్నారి రమ్య చనిపోయింది. ఆమె తాత మధుసూదనా చారి వెన్నుముకతో పాటు పక్కటెముకలు విరిగాయి. దీంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా సోమవారం ఉదయం కన్నుమూశారు.

ప్రమాదం సమయంలో పాప పక్కనే కూర్చున్న తల్లి రాధిక కుడి కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న రాజేష్ సోదరుడు రమేష్ ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రమ్య, రాజేష్‌లు మృతిచెందగా.. ఇంటి పెద్దదిక్కైన మధుసూధనాచారి కూడా తుది శ్వాస విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News