అప్పట్లో వందలసార్లు ఫోన్‌ చేసేవారు- చంద్రబాబుపై నటి ఫైర్

టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సినీ నటి, టీడీపీ నాయకురాలు కవిత.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. సోమవారం గచ్చిబౌలి లోని బయోడైవర్శిటీ పార్కులో హరితహారంలో పాల్గొన్న ఆమె… చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ధర్నా జరిగినా తనకు ఫోన్ చేసి పిలిచేవారని చెప్పారు. ఇలా అప్పట్లో వందల సార్లు తనకు టీడీపీ నాయకత్వం ఫోన్ చేసిందన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి తనను […]

Advertisement
Update: 2016-07-11 21:31 GMT

టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సినీ నటి, టీడీపీ నాయకురాలు కవిత.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. సోమవారం గచ్చిబౌలి లోని బయోడైవర్శిటీ పార్కులో హరితహారంలో పాల్గొన్న ఆమె… చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ధర్నా జరిగినా తనకు ఫోన్ చేసి పిలిచేవారని చెప్పారు.

ఇలా అప్పట్లో వందల సార్లు తనకు టీడీపీ నాయకత్వం ఫోన్ చేసిందన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి తనను అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం సేవ చేసిన తన పట్ల ఇలా వ్యవహరించడం బాధగా ఉందన్నారు. మహానటుడి పార్టీలో సినీనటులకు ప్రాధాన్యత లేకుండాపోయిందని కవిత వాపోయారు. ఏపీలో నిర్వహించిన నీరు -చెట్టు కార్యక్రమానికి ఒక్కరిని కూడా ఆహ్వానించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరిని భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు.

click on image to read-

Tags:    
Advertisement

Similar News