అతను రాస్తూనే ఉంటాడు...మీరు చదవకండి!
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన మధోరుభాగన్ నవలా ప్రతులను వెనక్కు తీసుకోవాలంటూ మత ఛాందస వాదులు వేసిన పిటీషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. రచయితగా మురుగన్కు స్వేచ్ఛగా తన భావాలను ప్రకటించే హక్కు ఉందని, మీకు నచ్చకపోతే ఆయా పుస్తకాలను చదవటం మానేయండి… అని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ (1)(ఎ) ప్రకారం ప్రతి ఒక్కరికీ తన భావాలను వ్యక్తం చేసే హక్కు ఉందని కోర్టు తెలిపింది. ఈ తీర్పుపై పెరుమాళ్ మురుగన్ హర్షం వ్యక్తం […]
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన మధోరుభాగన్ నవలా ప్రతులను వెనక్కు తీసుకోవాలంటూ మత ఛాందస వాదులు వేసిన పిటీషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. రచయితగా మురుగన్కు స్వేచ్ఛగా తన భావాలను ప్రకటించే హక్కు ఉందని, మీకు నచ్చకపోతే ఆయా పుస్తకాలను చదవటం మానేయండి… అని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ (1)(ఎ) ప్రకారం ప్రతి ఒక్కరికీ తన భావాలను వ్యక్తం చేసే హక్కు ఉందని కోర్టు తెలిపింది.
ఈ తీర్పుపై పెరుమాళ్ మురుగన్ హర్షం వ్యక్తం చేశారు. తనలోని రచయిత తిరిగి జీవం పోసుకునేందుకు ఈ తీర్పు దోహదం చేస్తుందని, తన గుండె తిరిగి ధైర్యాన్ని పుంజుకునే అవకాశాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. మురుగన్ 2010లో రాసిన మధోరుభాగన్ అనే నవల 2013లో ఆంగ్లంలోకి అనువాదం అయిన తరువాత దానిపై పెద్ద ఎత్తున నిరసనలు వెలువడ్డాయి. ఆ నవలలో ఆయన సుమారు వందేళ్ల క్రితం తిరుచెంగోడ్ అర్థనారీశ్వరుని గుడిలో అమలులో ఉన్న ఒక ఆచారం గురించి రాశారు.
సంతానం కలుగని ఆడవారు రథోత్సవం రోజు రాత్రి, వేరే పురుషుడితో కలిసుండే వీలుని కల్పించిన ఆ ఆచారం గురించి రాస్తూ, నాటి సామాజిక వాస్తవాలను, ఈ విషయంపై కుటుంబాల్లో జరిగిన సంఘర్షణని చిత్రించారు. దీనిపై కుల మత ఛాందస వాదులు పెద్ద ఎత్తున యాగీ చేశారు. ఆ నవల కాపీలను తగులబెట్టారు, బంద్లు నిర్వహించారు. మురుగన్ని అసభ్యంగా తిట్టారు, బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో మురుగన్ తన నివాసాన్ని ఆ ప్రాంతంనుండి మార్చుకోవలసి వచ్చింది. ఈ పరిస్థితులను ఎదుర్కొన్న మురుగన్ అప్పట్లో తనలోని రచయిత మరణించాడని ప్రకటించారు.