వారి కర్మ వారికే తగులుతుంది...

నటుడు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై కాసింత అసంతృప్తి వ్యక్తంచేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ముసిలిపేడు సమీపంలోని కొండకోనల్లో ఉన్న బత్తినయ్య స్వామి ఆలయ అభివృద్ధి విషయంలో అటవీ శాఖ తీరును ఆయన తప్పుపట్టారు. బత్తినయ్యస్వామిని భార్యతో కలిసి కాలినడకన వెళ్లి దర్శించుకున్న మోహన్‌బాబు… ఆలయ అభివృద్ధికి అటవీశాఖ అడ్డంకులు సృష్టించడం మంచి పద్దతి కాదన్నారు. బత్తినయ్యస్వామి ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. దేవుడి విషయంలో సహకరించకపోతే వారి కర్మ వారికే తగులుతుందని హెచ్చరించారు. […]

Advertisement
Update: 2016-06-27 11:46 GMT

నటుడు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై కాసింత అసంతృప్తి వ్యక్తంచేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం ముసిలిపేడు సమీపంలోని కొండకోనల్లో ఉన్న బత్తినయ్య స్వామి ఆలయ అభివృద్ధి విషయంలో అటవీ శాఖ తీరును ఆయన తప్పుపట్టారు. బత్తినయ్యస్వామిని భార్యతో కలిసి కాలినడకన వెళ్లి దర్శించుకున్న మోహన్‌బాబు… ఆలయ అభివృద్ధికి అటవీశాఖ అడ్డంకులు సృష్టించడం మంచి పద్దతి కాదన్నారు. బత్తినయ్యస్వామి ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు.

దేవుడి విషయంలో సహకరించకపోతే వారి కర్మ వారికే తగులుతుందని హెచ్చరించారు. భక్తులందరూ ఆనందంగా వచ్చి స్వామివారిని దర్శించుకునేలా చేయాలని కోరారు. అయితే అటవీ శాఖకు ప్రస్తుతం చిత్తూరుజిల్లాకే చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆలయం కూడా చిత్తూరు జిల్లాలోనిదే. మోహన్‌బాబు ఒకసారి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాల్సిందిపోయి మరి ఎవరి కర్మ వారికే తగులుతుందని హెచ్చరించడం ఏంటో.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News