రాములమ్మ ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు!

హైద‌రాబాద్‌లో దొంగ‌లు తెలివి మీరుతున్నారు. సామాన్యుల‌ను వ‌దిలి ప్ర‌జాప్ర‌తినిధుల వ‌స్తువుల‌నే టార్గెట్ చేస్తున్నారు. మొన్న‌టి మొన్న కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ సెల్‌ఫోన్ చోరీ విష‌యం మ‌ర‌వ‌క ముందే మ‌రో ప్ర‌జాప్ర‌తినిధి, సినీన‌టి విజ‌య‌శాంతి ఇంట్లోనూ తాజాగా చోరీ జ‌ర‌గ‌డం న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఆమె చెవి దిద్దులు, వ‌జ్ర‌పుటుంగ‌రం అప‌హ‌ర‌ణ‌కు గుర‌య్యాయి. వివ‌రాలు.. బంజారాహిల్స్‌లో మాజీఎంపీ, సినీన‌టి నివాసం ఉంది. శుక్ర‌వారం ఆమె ఇంట్లో నుంచి వ‌జ్ర‌పుటుంగ‌రం, బంగారు చెవిదుద్దులు క‌నిపించ‌డం లేదు. చాలాసేపు వెదికిన త‌రువాత […]

Advertisement
Update: 2016-06-17 22:57 GMT
హైద‌రాబాద్‌లో దొంగ‌లు తెలివి మీరుతున్నారు. సామాన్యుల‌ను వ‌దిలి ప్ర‌జాప్ర‌తినిధుల వ‌స్తువుల‌నే టార్గెట్ చేస్తున్నారు. మొన్న‌టి మొన్న కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ సెల్‌ఫోన్ చోరీ విష‌యం మ‌ర‌వ‌క ముందే మ‌రో ప్ర‌జాప్ర‌తినిధి, సినీన‌టి విజ‌య‌శాంతి ఇంట్లోనూ తాజాగా చోరీ జ‌ర‌గ‌డం న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఆమె చెవి దిద్దులు, వ‌జ్ర‌పుటుంగ‌రం అప‌హ‌ర‌ణ‌కు గుర‌య్యాయి. వివ‌రాలు.. బంజారాహిల్స్‌లో మాజీఎంపీ, సినీన‌టి నివాసం ఉంది. శుక్ర‌వారం ఆమె ఇంట్లో నుంచి వ‌జ్ర‌పుటుంగ‌రం, బంగారు చెవిదుద్దులు క‌నిపించ‌డం లేదు. చాలాసేపు వెదికిన త‌రువాత విజ‌య‌శాంతి త‌న ఇంట్లో చోరీ జ‌రిగింద‌ని గుర్తించారు. వెంట‌నే బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు విచార‌ణ మొద‌లు పెట్టినట్లు స‌మాచారం. వీఐపీలు నివ‌సించే ప్రాంతంలో ఉన్న విజ‌య‌శాంతి ఇంట్లో చోరీ జ‌ర‌గ‌డం మీడియా బ్రేకింగ్ న్యూస్‌గా మారింది. బంజారాహిల్స్ పోలీసుల‌కు నేరుగా విజ‌య‌శాంతే ఫిర్యాదు చేశారా? ఇత‌ర కుటుంబ స‌భ్యులెవ‌రైనా చేశారా? అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉండే ప్రాంతంలో ఉండే విజ‌య‌శాంతి నివాసంలో చోరీ పోలీసుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తోంది. ఇది తెలిసిన వారి ప‌నే అయిఉంటుంద‌ని భావిస్తున్నారు. ఆ దిశ‌గానే ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలిసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News