రేసు గుర్రం... కంచర గాడిదగా మారిందా?

ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. చాలా మంది ఆదినారాయణరెడ్డిని వ్యతిరేకిస్తూ వైసీపీలోనే కొనసాగుతున్నారని అలాంటి వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పైకి ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అంటున్న ఆదినారాయణరెడ్డి చేతల్లో మాత్రం మరొకటి చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున నామినేషన్ వేస్తూ తాను రేసుగుర్రాన్నని… మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాత్రం కంచర గాడిద అని ఆదినారాయణరెడ్డి చెప్పుకున్నారని […]

Advertisement
Update: 2016-06-18 03:00 GMT

ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. చాలా మంది ఆదినారాయణరెడ్డిని వ్యతిరేకిస్తూ వైసీపీలోనే కొనసాగుతున్నారని అలాంటి వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పైకి ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అంటున్న ఆదినారాయణరెడ్డి చేతల్లో మాత్రం మరొకటి చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున నామినేషన్ వేస్తూ తాను రేసుగుర్రాన్నని… మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాత్రం కంచర గాడిద అని ఆదినారాయణరెడ్డి చెప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ రేసుగుర్రం కాస్త పార్టీ మారి కంచర గాడిదలా మారిందని విమర్శించారు.

విలువల్లేని నాయకులు కాకుండా నిరాడంబరులైనా వారిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో, భవిష్యత్తులో ఫ్యాక్షన్ రాజకీయాలు కాకుండా స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలని లక్ష్యంతోనే సుధీర్‌రెడ్డికి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారన్నారు. నైతిక విలువల గురించి గొప్పలు చెప్పుకునే ఆదినారాయణరెడ్డి పార్టీ మారి 100 రోజులైనా రాజీనామా చేయకపోవడాన్ని ఏమనాలని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని సర్వేలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. అవినాష్ రెడ్డి సమక్షంలో జమ్మలమడుగుకు చెందిన 200 కుటుంబాలు టీడీపీనుంచి వైసీపీలో చేరాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News