ఎవరెస్టుని ఎక్కాకే...పిల్లలు!
ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నఓ జంట ఎవరెస్టు ఎక్కాకే పిల్లలను కనాలని నిర్ణయించుకుంది. చివరికి వారి కోరిక నెరవేరింది. మహారాష్ట్రకు చెందిన దినేష్, తారకేశ్వరి రాథోడ్లు తాము కలలు కన్నట్టుగానే …గత నెల 23న ఎవరెస్టుని అధిరోహించారు. దీంతో వారు ఎవరెస్టుని ఎక్కిన మొట్టమొదటి భారతీయ జంటగా రికార్డు సృష్టించారు. పదేళ్ల క్రితం మహారాష్ట్ర పోలీస్ శాఖలో చేరిన వీరిద్దరూ ఇప్పుడు 30ల వయసులో ఉన్నారు. సోమవారం విలేకరులకు తమ గురించి వివరించిన ఈ జంట, ఎవరెస్టు […]
ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నఓ జంట ఎవరెస్టు ఎక్కాకే పిల్లలను కనాలని నిర్ణయించుకుంది. చివరికి వారి కోరిక నెరవేరింది. మహారాష్ట్రకు చెందిన దినేష్, తారకేశ్వరి రాథోడ్లు తాము కలలు కన్నట్టుగానే …గత నెల 23న ఎవరెస్టుని అధిరోహించారు. దీంతో వారు ఎవరెస్టుని ఎక్కిన మొట్టమొదటి భారతీయ జంటగా రికార్డు సృష్టించారు. పదేళ్ల క్రితం మహారాష్ట్ర పోలీస్ శాఖలో చేరిన వీరిద్దరూ ఇప్పుడు 30ల వయసులో ఉన్నారు. సోమవారం విలేకరులకు తమ గురించి వివరించిన ఈ జంట, ఎవరెస్టు అధిరోహకులు అనిపించుకున్నాకే, తల్లిదండ్రులుగా మారాలని నిర్ణయించుకున్నామని, ఇప్పుడు గర్వంగా సంతానం పొందాలని అనుకుంటున్నామని చెప్పారు. గత ఏడాదే ఎవరెస్టుని ఎక్కాలని అనుకున్న ఈజంట, నేపాల్లో భూకంపం సంభవించడంతో ఆగిపోయారు. ఈ ఏడాది వారి కలని నెరవేర్చుకున్నారు.