హమ్మయ్య... మొత్తానికి సెట్స్ పైకి వచ్చాడు..

హీరో రామ్ చరణ్ కూడా తండ్రిలానే తన సినిమాను చాన్నాళ్లు నానుస్తాడని చాలామంది బాధపడ్డారు. కానీ చెర్రీ మాత్రం ఆ పని చేయలేదు. ఎట్టకేలకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను నిన్న (జూన్ 4) స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నిజానికి ఇది సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్. చాన్నాళ్ల కిందటే తొలి షెడ్యూల్ జరిగింది. కానీ మొదటి షెడ్యూల్ లో చెర్రీ పాల్గొనలేదు. మిగత సన్నివేశాలు మాత్రమే తీశారు. ఇన్నాళ్లకు […]

Advertisement
Update: 2016-06-05 00:38 GMT
హీరో రామ్ చరణ్ కూడా తండ్రిలానే తన సినిమాను చాన్నాళ్లు నానుస్తాడని చాలామంది బాధపడ్డారు. కానీ చెర్రీ మాత్రం ఆ పని చేయలేదు. ఎట్టకేలకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను నిన్న (జూన్ 4) స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నిజానికి ఇది సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్. చాన్నాళ్ల కిందటే తొలి షెడ్యూల్ జరిగింది. కానీ మొదటి షెడ్యూల్ లో చెర్రీ పాల్గొనలేదు. మిగత సన్నివేశాలు మాత్రమే తీశారు. ఇన్నాళ్లకు చెర్రీని డైరక్ట్ చేసే అవకాశం సురేందర్ రెడ్డికి వచ్చింది. తండ్రి మెగాస్టార్ సినిమా లేటవుతున్న కారణంగా… వీలైనంత త్వరగా తన సినిమాను పూర్తిచేయాలని చెర్రీ భావిస్తున్నాడు. అందుకే కాస్త స్లోగా చేద్దామనుకున్న సినిమాను ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ఇకపై ఈ సినిమా షూటింగ్ ఏకథాటిగా జరుగుతుందట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ధృవ అనే పేరును పరిశీలిస్తున్నారు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. తమిళ్ లో హిట్టయిన థని ఒరువన్ అనే సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఓ కొత్త గెటప్ తో తయారయ్యాడు చెర్రీ. సినిమాలో చెర్రీ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News