మంత్రిగారు ఇంత చీపా? గోపాలకృష్ణను మోసగించిన మహిళ

మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పదేపదే మోసగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక యువకుడు మంత్రికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. 35 వేలు ఇవ్వకపోతే మంత్రి అవినీతిఅక్రమాలకు సంబంధించిన వివరాలన్నీ మీడియాకు అప్పగిస్తానని బెదిరించాడు. అయితే ఆ యువకుడిని తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మంత్రి గోపాలకృష్ణ ఒక మహిళ చేతిలో మోసపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. అది కూడా కేవలం రూ. 7వేలకు మంత్రిని సదరు మహిళ మోసం చేసింది. […]

Advertisement
Update: 2016-05-26 21:55 GMT

మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పదేపదే మోసగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక యువకుడు మంత్రికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. 35 వేలు ఇవ్వకపోతే మంత్రి అవినీతిఅక్రమాలకు సంబంధించిన వివరాలన్నీ మీడియాకు అప్పగిస్తానని బెదిరించాడు. అయితే ఆ యువకుడిని తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మంత్రి గోపాలకృష్ణ ఒక మహిళ చేతిలో మోసపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. అది కూడా కేవలం రూ. 7వేలకు మంత్రిని సదరు మహిళ మోసం చేసింది.

గుంటూరు జిల్లా మంగళగిరి మన్యవారి వీధికి చెందిన పి.విజయలక్ష్మి 2014 డిసెంబర్‌లో తన పేరు సుజాతారావుగా చెప్పుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణ ఇంటికి వెళ్లింది. తాను రిటైర్డ్ ఐఏఎస్ కేఎల్‌రావు కుమార్తె అని మంత్రి పీఎస్‌వో వాసుతో చెప్పింది. మంత్రి కోసం వచ్చానని అతన్ని నమ్మించింది. అనంతరం అవసరం ఉందంటూ రూ.7 వేలు తీసుకుని అక్కడ నుంచి జారుకుంది. అప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉంది. ఎట్టకేలకు పోలీసులు బుధవారం విజయవాడలో ఆమెను అరెస్ట్ చేశారు. అయితే కొందరు ఇలాంటి వారు పదేపదే మంత్రిగోపాలకృష్ణారెడ్డినే టార్గెట్ చేయడం యాదృచ్చికమే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News