అందుకు గర్విస్తున్నా.. ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ కుటుంబంతోనే ఉంటా..

వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. మొత్తం నాలుగుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రంపై జగన్ తొలి సంతకం చేశారు. పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి… వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాల అనుబంధం ఉందన్నారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్‌ ఇలా మూడు జనరేషన్ల వద్ద పనిచేయడం తనకు గర్వంగా ఉందన్నారు. తన ప్రాణమున్నంత […]

Advertisement
Update: 2016-05-26 01:19 GMT

వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. మొత్తం నాలుగుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రంపై జగన్ తొలి సంతకం చేశారు. పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి… వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాల అనుబంధం ఉందన్నారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్‌ ఇలా మూడు జనరేషన్ల వద్ద పనిచేయడం తనకు గర్వంగా ఉందన్నారు. తన ప్రాణమున్నంత వరకు వైఎస్ కుటుంబంతోనే తన ప్రయాణం ఉంటుందన్నారు. పార్టీ పేరుప్రతిష్ఠలు పెంచేందుకు, అధ్యక్షుడి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేందుకు శాయశక్తుల కృషిచేస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. విజయసాయిరెడ్డి రాజారెడ్డి వద్ద కూడా ఆడిటర్ గా పనిచేశారు.

అంతకు ముందు సాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకుల సమక్షంలో జగన్ ప్రతిపాదించారు. కేసులు పెట్టిన సమయంలో తనకు వ్యతిరేకంగా చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఎంతో ఒత్తిడి తెచ్చారని, ఎన్నో ఆశలు చూపారని కానీ విజయసాయిరెడ్డి సత్యాన్ని నమ్ముకున్నారని, నైతికతకు కట్టుబడి ఉన్నారని జగన్ ప్రశంసించారు. విజయసాయిరెడ్డి లొంగకపోవడంతోనే ఆయన్ను కూడా కేసుల్లో ఇరికించారని జగన్‌ పార్టీ నేతల సమావేశంలో చెప్పారు. విజయసాయిరెడ్డి తొలినుంచి కూడా మనతోనే ఉన్నారని విశ్వసనీయులకు సరైనస్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే సాయిరెడ్డి పేరును రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నానని జగన్ చెప్పారు. జగన్ ప్రతిపాదనకు పార్టీ నేతలంతా మద్దతు పలికారు. చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలు చేస్తూ మనుషుల సంబంధాలను డబ్బుతో కొనేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు వారిని నట్టేట ముంచడం ఖాయమన్నారు జగన్‌. వైసీపీ ఒక్క మాటకోసం పుట్టిన పార్టీ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News