జనతా గ్యారేజీకి మరో స్పెషల్ ఎట్రాక్షన్

కొరటాలశివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజీ సినిమాకు రోజుకో ఎట్రాక్షన్ తోడవుతోంది. ఇప్పటికే మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్ తో పాటు పలువురు మలయాళీ నటులు ఇందులో చేరారు. తాజాగా ఓ మరాఠీ నటుడు కూడా చేరాడు. మరఠీ సినిమాలతో పాపులర్ అయిన సచిన్ కేద్ కర్.. జనతా గ్యారేజీలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే నాన్న, బ్రదర్స్, సింగం-2 లాంటి సినిమాల్లో కనిపించిన ఈ విలక్షణ నటుడు… జనతా గ్యారేజీలో విలన్ గా […]

Advertisement
Update: 2016-05-25 23:01 GMT

కొరటాలశివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజీ సినిమాకు రోజుకో ఎట్రాక్షన్ తోడవుతోంది. ఇప్పటికే మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్ తో పాటు పలువురు మలయాళీ నటులు ఇందులో చేరారు. తాజాగా ఓ మరాఠీ నటుడు కూడా చేరాడు. మరఠీ సినిమాలతో పాపులర్ అయిన సచిన్ కేద్ కర్.. జనతా గ్యారేజీలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే నాన్న, బ్రదర్స్, సింగం-2 లాంటి సినిమాల్లో కనిపించిన ఈ విలక్షణ నటుడు… జనతా గ్యారేజీలో విలన్ గా కనిపించబోతున్నాడని సమాచారం. జనతా గ్యారేజీ సినిమాకు సంబంధించి మోహన్ లాల్ బ్యాక్ గ్రౌండ్ లో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో సచిక్ కేద్కర్ కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం జనతా గ్యారేజీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే యూనిట్ అంతా చెన్నై వెళ్తుంది. కొన్ని వారాల పాటు అక్కడ కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఆ తర్వాత పాటల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తారు. మూవీని ఆగస్ట్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News