అరేహో సాంబ రాస్కో... "పులివెందుల కంటే రెండింత‌లు"

టీడీపీ నేత‌, వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయ‌ణ‌రెడ్డి .. జ‌గ‌న్‌ తీరును త‌ప్పుప‌ట్టారు. చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేశారు. క‌రువు అల్లాడుతున్న క‌డ‌ప జిల్లాను ఆదుకునేందుకు వారంలో చంద్ర‌బాబు రెండుసార్లు జిల్లాకు వ‌చ్చార‌ని… జ‌గ‌న్ మాత్రం సేవ్ డెమొక్ర‌సి అంటూ ఢిల్లీలో తిరిగార‌ని ఎద్దేవా చేశారు. ప‌ట్టిసీమ రాయ‌ల‌సీమ‌కు ఆయువుప‌ట్టులాంటిద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పారు. ఈ విష‌యం జ‌గ‌న్‌కు తాము ఎన్ని సార్లు చెప్పినా విన‌లేద‌న్నారు. రాయ‌ల‌సీమ‌లో ప్రాజెక్టుల‌న్నీ చంద్ర‌బాబు పూర్తి చేస్తార‌ని చెప్పారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు అభివృద్ధి కోసం వంద‌రోజుల […]

Advertisement
Update: 2016-05-01 05:00 GMT

టీడీపీ నేత‌, వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయ‌ణ‌రెడ్డి .. జ‌గ‌న్‌ తీరును త‌ప్పుప‌ట్టారు. చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేశారు. క‌రువు అల్లాడుతున్న క‌డ‌ప జిల్లాను ఆదుకునేందుకు వారంలో చంద్ర‌బాబు రెండుసార్లు జిల్లాకు వ‌చ్చార‌ని… జ‌గ‌న్ మాత్రం సేవ్ డెమొక్ర‌సి అంటూ ఢిల్లీలో తిరిగార‌ని ఎద్దేవా చేశారు. ప‌ట్టిసీమ రాయ‌ల‌సీమ‌కు ఆయువుప‌ట్టులాంటిద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పారు. ఈ విష‌యం జ‌గ‌న్‌కు తాము ఎన్ని సార్లు చెప్పినా విన‌లేద‌న్నారు. రాయ‌ల‌సీమ‌లో ప్రాజెక్టుల‌న్నీ చంద్ర‌బాబు పూర్తి చేస్తార‌ని చెప్పారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు అభివృద్ధి కోసం వంద‌రోజుల ప్ర‌ణాళిక సిద్ధం చేసి చంద్ర‌బాబుకు అంద‌జేశాన‌ని చెప్పారు. కృష్ణా, పెన్నా న‌దుల‌ను కూడా చంద్ర‌బాబు అనుసంధానం చేస్తార‌ని ఆది అన్నారు. నారా లోకేష్ అభివృద్ధిపై చిత్త‌శుద్దితో ముందుకెళుతున్నార‌ని ప్ర‌శంసించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగులో పులివెందుల కంటే రెండింత‌ల మెజారిటీ సాధిస్తామ‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి చెప్పుకొచ్చారు. కడపలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జ‌మ్మ‌ల‌మ‌డుగులో పులివెందుల కంటే రెండింత‌ల మెజారిటీ సాధించే సామ‌ర్థ్యం ఉంటే… ప్ర‌స్తుతం వైసీపీ నుంచి ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి సాధార‌ణ మెజారిటీతోనైనా గెల‌వ‌చ్చు కదా అన్న అనుమానం స‌హజం. ఒక‌వేళ రాజీనామా చేసి ఆదినారాయ‌ణ‌రెడ్డి గెలిస్తే నిజంగానే ఆయ‌న గ్రేట్ లీడ‌ర్ అవుతారు. కానీ అలా చేసే ప‌రిస్థితులు కనిపించ‌డం లేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News