రూ. 20 కోట్లు, రాజ‌ధానిలో ఎక‌రం భూమి ఇస్తామ‌న్నారు- వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అన్ని మార్గాల్లో ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా ఉంది. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల‌నాయుడు… నారా లోకేష్, ఎంపీ సీఎం ర‌మేష్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. లోకేష్, సీఎం ర‌మేష్ క‌లిసి త‌న‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించార‌ని వెల్ల‌డించారు. టీడీపీలో చేరితే రూ. 20కోట్ల న‌గ‌దుతో పాటు అమ‌రావ‌తిలో ఎక‌రం భూమి ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. పెద్దెత్తున కాంట్రాక్టులు కూడా ఇస్తామ‌న్నార‌ని బ‌య‌ట‌పెట్టారు. నీతిమాలిన ఎమ్మెల్యేగా నిలిచిపోకూడ‌దని టీడీపీ నేత‌ల ప్ర‌లోభాన్ని […]

Advertisement
Update: 2016-04-30 09:37 GMT

వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అన్ని మార్గాల్లో ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా ఉంది. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల‌నాయుడు… నారా లోకేష్, ఎంపీ సీఎం ర‌మేష్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. లోకేష్, సీఎం ర‌మేష్ క‌లిసి త‌న‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించార‌ని వెల్ల‌డించారు. టీడీపీలో చేరితే రూ. 20కోట్ల న‌గ‌దుతో పాటు అమ‌రావ‌తిలో ఎక‌రం భూమి ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. పెద్దెత్తున కాంట్రాక్టులు కూడా ఇస్తామ‌న్నార‌ని బ‌య‌ట‌పెట్టారు.

నీతిమాలిన ఎమ్మెల్యేగా నిలిచిపోకూడ‌దని టీడీపీ నేత‌ల ప్ర‌లోభాన్ని తిర‌స్క‌రించాన‌ని ముత్యాల‌నాయుడు చెప్పారు. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోనే ముందుకెళ్తాన‌న్నారు. నిజాయితీ ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల్లో ఉంటానన్నారు. జ‌గ‌న్‌తో క‌లిసి ఢిల్లీకి వెళ్లే ముందు కూడా టీడీపీ నేత‌ల నుంచి ఫోన్లు వ‌చ్చాయ‌న్నారు. మ‌రింత డ‌బ్బు ఇచ్చేందుకైనా సిద్ధ‌మ‌ని… అవ‌స‌ర‌మైతే లోకేష్‌తో భేటీ ఏర్పాటు చేయిస్తామ‌ని వెంట‌ప‌డ్డార‌ని వెల్ల‌డించారు.

పార్టీలో చేరిన ఎమ్మెల్యే కిడారితో కలసి అరకులో చంద్ర‌బాబు సభ పెట్టాల‌ని.. అదే రోజు తాము కూడా అక్కడే జగన్‌తో సభ పెడతామ‌న్నారు. గిరిజనం ఎవరి వెంట ఉన్నారో స‌భ‌తో తేలిపోతుందని ముత్యాల నాయుడు సవాల్ చేశారు. . బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు 150 ఎకరాల కోసం టీడీపీలో చేరారని విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News