రూ. 1,34,295 కోట్లు- రెండేళ్లకే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బాబు

ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు గాలం వేయడాన్ని నిరసిస్తూ సేవ్ డెమొక్రసి పేరుతో జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో జాతీయ నాయకులను కలుస్తున్నారు. ఉదయం ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను జగన్ బృందం కలిసింది. చంద్రబాబు అవినీతి అరాచకాలను ఆయనకు వివరించినట్టు జగన్ చెప్పారు. ఈ సందర్భంగా  చంద్రబాబు అవినీతిపై వైసీపీ ఒక ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించింది. ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ ( అవినీతి చక్రవర్తి ) పేరుతో రూపొందించిన పుస్తకాన్ని జాతీయ నేతలకు అందజేస్తున్నారు.  […]

Advertisement
Update: 2016-04-26 00:40 GMT

ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు గాలం వేయడాన్ని నిరసిస్తూ సేవ్ డెమొక్రసి పేరుతో జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో జాతీయ నాయకులను కలుస్తున్నారు. ఉదయం ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను జగన్ బృందం కలిసింది. చంద్రబాబు అవినీతి అరాచకాలను ఆయనకు వివరించినట్టు జగన్ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు అవినీతిపై వైసీపీ ఒక ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించింది.

ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ ( అవినీతి చక్రవర్తి ) పేరుతో రూపొందించిన పుస్తకాన్ని జాతీయ నేతలకు అందజేస్తున్నారు. రెండేళ్ల కాలంలో చంద్రబాబు లక్షా 34 వేల 295 కోట్ల అవినీతి చేసినట్టు కవర్ పేజీపై ముద్రించారు. ఇందులో అక్రమ జీవోలు, డాక్యుమెంట్లు, అమరావతిలో భూ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను ముద్రించినట్టు జగన్ చెప్పారు. చంద్రబాబు అవినీతి ఎలా సాగుతున్నది సవివరంగా వివరించామన్నారు. ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల నేతలకు అందజేస్తామన్నారు.

లక్షల కోట్ల బ్లాక్‌మనీ సంపాదించిన చంద్రబాబు ఆ సొమ్ముతోనే ఒక్కో ఎమ్మెల్యేకు 20, 30 కోట్లు ఇచ్చి కొంటున్నారని జగన్ ఆరోపించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియో టేపులతో సహా దొరికిపోయినా చంద్రబాబుపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. మొత్తం మీద ‘’ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ – రూ. 1, 34, 295 కోట్లు’’ పేరుతో వైసీపీ పుస్తకం వేయడం, దాన్ని జాతీయ స్థాయిలో పంచిపెట్టడం చంద్రబాబుకు ఇబ్బందికరపరిణామమే. అప్పట్లో జగన్ ఐదేళ్లలో లక్ష కోట్ల అవినీతి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ రెండేళ్లలో చంద్రబాబు లక్ష కోట్ల మ్యాజిక్ ఫిగర్ దాటేసిందంటోంద

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News