నోరు జారి నిజం చెప్పిన ప్రత్తిపాటి

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నోరు జారారు. పార్టీ ఫిరాయింపులపై అసలు నిజం చెప్పి వెంటనే నాలుక కరుచుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగే టీడీపీలోకి వస్తున్నారంటూ విలేకర్ల సమావేశంలో చెప్పేశారు. తెలంగాణాలో టీడీపీ నాయకులు గానీ, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ఎమ్మెల్యేలు గానీ తమ స్వంత ప్రయోజనాలకు,ఇతర ప్రలోభాలకు,  సొంతలాభాల కోసమే పార్టీ మారుతున్నారని వెల్లడించారు. మంత్రి పుల్లారావు చెప్పిన సమాధానంతో విలేకరులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకున్న మంత్రి మాట మార్చి తమ నేత  చంద్రబాబు  చేస్తున్న అభివృద్ధిని, […]

Advertisement
Update: 2016-04-25 11:24 GMT

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నోరు జారారు. పార్టీ ఫిరాయింపులపై అసలు నిజం చెప్పి వెంటనే నాలుక కరుచుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగే టీడీపీలోకి వస్తున్నారంటూ విలేకర్ల సమావేశంలో చెప్పేశారు. తెలంగాణాలో టీడీపీ నాయకులు గానీ, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ఎమ్మెల్యేలు గానీ తమ స్వంత ప్రయోజనాలకు,ఇతర ప్రలోభాలకు, సొంతలాభాల కోసమే పార్టీ మారుతున్నారని వెల్లడించారు.

మంత్రి పుల్లారావు చెప్పిన సమాధానంతో విలేకరులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకున్న మంత్రి మాట మార్చి తమ నేత చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని, తాము అవలంభిస్తున్న విధానాలను చూసే వైసీపీ నాయకులు తమ పార్టీలోకి వస్తున్నారని వెంటనే నాలుక మడతేశారు.

అంతే కాదు… వైసీపీ నాయకులు ఈ ఫిరాయింపులపై ఎవరికి ఫిర్యాదు చేసినా లాభం లేదని తేల్చేశారు. ఎవరికి పిర్యాదులు చేసినా ఫిరాయింపులను ఆపబోమని పరోక్షంగా చెప్పారు. గవర్నర్‌తో పాటు దేశ ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఒక మంత్రి ఇలా దేశంలో ఎవరికి చెప్పుకున్నా తాము మాత్రం ఎమ్మెల్యేలను గోడదూకించడం మానుకోబోమని చెప్పడం బరి తెగింపుకు నిదర్శనమే.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News