మంత్రి రావెల వివాదాస్పద వ్యాఖ్యలు

మంత్రి రావెల కిషోర్ బాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు రావెల.  తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు కలిసి తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నడుపుతున్న ప్రాంతీయ తీవ్రవాదానికి భయపడే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని రావెల చెప్పారు. ప్రాంతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. అంతే కాదు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులను పట్టించుకోవాల్సిన అవసరం […]

Advertisement
Update: 2016-04-23 10:57 GMT

మంత్రి రావెల కిషోర్ బాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌ కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు రావెల. తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు కలిసి తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నడుపుతున్న ప్రాంతీయ తీవ్రవాదానికి భయపడే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని రావెల చెప్పారు. ప్రాంతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

అంతే కాదు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు రావెల. ర్యాంకులు ఎక్కువ వచ్చిన మంత్రులు గొప్ప కాదని.. తక్కువ ర్యాంకులు వచ్చిన మంత్రుల పని తీరు బాగోలేదని కూడా చెప్పలేమన్నారు. కేవలం పనితీరును మెరుగుపర్చుకోవడానికే ర్యాంకులు కేటాయిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం నడుస్తోందని మరో రాష్ట్ర మంత్రి వ్యాఖ్యానించడం పెద్దవిషయమే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News