వైసీపీని వీడడంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే సుబ్బారావు

జ్యోతుల నెహ్రు బృందం వైసీపీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. జ్యోతుల నెహ్రు తోడల్లుడు, పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తిలో కార్యకర్తలతో సమావేశమైన పరువుల సుబ్బారావు.. తాను టీడీపీలో చేరుతున్నట్టు కార్యకర్తలతో చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు.  టీడీపీ నుంచి కూడా తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. జ్యోతులతోపాటు సుబ్బారావు కూడా పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు ఆయనే స్పష్టత ఇచ్చారు. జ్యోతుల […]

Advertisement
Update: 2016-03-27 02:52 GMT

జ్యోతుల నెహ్రు బృందం వైసీపీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. జ్యోతుల నెహ్రు తోడల్లుడు, పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తిలో కార్యకర్తలతో సమావేశమైన పరువుల సుబ్బారావు.. తాను టీడీపీలో చేరుతున్నట్టు కార్యకర్తలతో చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. టీడీపీ నుంచి కూడా తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. జ్యోతులతోపాటు సుబ్బారావు కూడా పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు ఆయనే స్పష్టత ఇచ్చారు. జ్యోతుల నెహ్రు సొంతూరుకు వెళ్లి ఆదివారం ఉదయం ఎమ్మెల్యే చెవిరెడ్డి చర్చలు జరిపారు. అయితే చర్చలు ఫలించినట్టు లేదు. మొత్తం మీద జ్యోతుల పార్టీ వీడడం ఖాయమని ఇప్పటికే వైసీపీ నాయకత్వం కూడా ఒక అంచనాకు వచ్చిందని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News