వారి జాబితా ఇస్తే వారిని టీడీపీలోకి తీసుకొస్తా....

మంత్రి పదవి హామీతోనే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారని ప్రచారం జరిగింది.  లోకల్లో భూమా అనుచరులు ఒక అడుగు ముందుకేసి తమ నేతకు విద్యుత్ శాఖ వస్తుందని ప్రచారం చేశారు. భూమా విద్యుత్ శాఖ మంత్రి కాగానే శిల్పామోహన్‌ రెడ్డికి చెందిన  కేబుల్ వైర్లు … విద్యుత్ స్తంభాలపై వెళ్లకుండా చూస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొందరు మీడియా ప్రతినిధులు భూమా నాగిరెడ్డిని మంత్రి పదవిపై ప్రశ్నించారు. మంత్రి ఎప్పుడు అవుతున్నారని విలేకర్లు […]

Advertisement
Update: 2016-03-09 01:23 GMT

మంత్రి పదవి హామీతోనే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారని ప్రచారం జరిగింది. లోకల్లో భూమా అనుచరులు ఒక అడుగు ముందుకేసి తమ నేతకు విద్యుత్ శాఖ వస్తుందని ప్రచారం చేశారు. భూమా విద్యుత్ శాఖ మంత్రి కాగానే శిల్పామోహన్‌ రెడ్డికి చెందిన కేబుల్ వైర్లు … విద్యుత్ స్తంభాలపై వెళ్లకుండా చూస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొందరు మీడియా ప్రతినిధులు భూమా నాగిరెడ్డిని మంత్రి పదవిపై ప్రశ్నించారు.

మంత్రి ఎప్పుడు అవుతున్నారని విలేకర్లు ప్రశ్నించగా… తాను కూడా ఈ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నా… అయితే మంత్రి ఎప్పుడొస్తుందన్న దానిపై తన దగ్గర సమాధానం లేదని చెప్పారు. కర్నూలు జిల్లా నుంచి ఇంకా ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారా అని ప్రశ్నించగా… మీరు జాబితా ఇస్తే… వారందరినీ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా అంటూ నవ్వుతూ చెబుతూ వెళ్లిపోయారు. భూమా వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే ఆయన మంత్రి పదవి ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదంటున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News