భూమానాగిరెడ్డిపై మీడియాలో క‌థ‌నాలు

ఏపీలో ఫిరాయింపు రాజ‌కీయాలు రస‌ర‌త్త‌రంగా సాగుతున్నాయి. కొద్దికాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటూ టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా మ‌రోసారి వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై మీడియాలో క‌థ‌నాలు పెద్దెత్తున ప్ర‌సారం అవుతున్నాయి. భూమా నాగిరెడ్డితో పాటు ఆయ‌న కుమార్తె భూమా అఖిల‌ప్రియ‌, మ‌రో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నార‌ని క‌థ‌నాల సారాంశం. భూమానాగిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నేడు ( శుక్రవారం) కార్యకర్తలతో స‌మావేశం ఏర్పాటు చేసేందుకు భూమా సిద్ధ‌మ‌య్యార‌ని […]

Advertisement
Update: 2016-02-19 03:23 GMT

ఏపీలో ఫిరాయింపు రాజ‌కీయాలు రస‌ర‌త్త‌రంగా సాగుతున్నాయి. కొద్దికాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటూ టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా మ‌రోసారి వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై మీడియాలో క‌థ‌నాలు పెద్దెత్తున ప్ర‌సారం అవుతున్నాయి. భూమా నాగిరెడ్డితో పాటు ఆయ‌న కుమార్తె భూమా అఖిల‌ప్రియ‌, మ‌రో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నార‌ని క‌థ‌నాల సారాంశం. భూమానాగిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నేడు ( శుక్రవారం) కార్యకర్తలతో స‌మావేశం ఏర్పాటు చేసేందుకు భూమా సిద్ధ‌మ‌య్యార‌ని చెబుతున్నారు. అయితే ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో భూమా నాగిరెడ్డి స్పందిస్తే తెలుస్తుంది. భూమా నాగిరెడ్డి ప్రస్తుతం పీఏసీ చైర్మన్ గాను ఉన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News