టీడీపీకి మరోషాక్, గోడ దూకిన 10వ ఎమ్మెల్యే

తెలంగాణ టీడీపీ దాదాపు ఖతమయ్యేలా ఉంది. బుధవారం టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరగా గురువారం రాత్రి మరో వికెట్ పడింది. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌ రెడ్డి టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్‌ రావు చెప్పి 24 గంటలు కూడా గడవకముందే రాజేందర్‌ రెడ్డి కారెక్కేశారు. రాజేందర్‌ రెడ్డి చేరికతో టీఆర్‌ఎస్‌లో చేరిన టీటీడీపీ ఎమ్మెల్యే సంఖ్య […]

Advertisement
Update: 2016-02-11 10:32 GMT

తెలంగాణ టీడీపీ దాదాపు ఖతమయ్యేలా ఉంది. బుధవారం టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరగా గురువారం రాత్రి మరో వికెట్ పడింది. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌ రెడ్డి టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్‌ రావు చెప్పి 24 గంటలు కూడా గడవకముందే రాజేందర్‌ రెడ్డి కారెక్కేశారు. రాజేందర్‌ రెడ్డి చేరికతో టీఆర్‌ఎస్‌లో చేరిన టీటీడీపీ ఎమ్మెల్యే సంఖ్య 10కి చేరింది. ఇక టీడీపీలో మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. రేవంత్ రెడ్డి, మాగంటి గోపినాథ్, ఆర్. కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య, గాంధీ మాత్రమే ఉన్నారు. వారిలోనూ కొందరు కారెక్కుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News