సినిమా పనైపోయినా... కేసులు ఆగట్లేదు

బాజీరావ్ మస్తానీ…. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన అద్భుత దృశ్యకావ్యం. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే నటించిన శృంగార ప్రేమకావ్యం. ఈ సినిమా విడుదలైన వెంటనే వసూళ్ల వర్షం కురిపించింది. అన్ని సెంటర్లలో బ్రహ్మాండంగా ఆడింది. దాదాపు 3వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అటు ఫిలింఫేర్ లో కూడా దీనికి 10 అవార్డులు వచ్చాయి. సో… సినిమా మేటర్ కంప్లీట్ అయింది. వసూళ్లు-అవార్డులు అన్నీ అందుకున్న ఆ సినిమా కథ కంచికి చేరింది. కానీ దానిపై […]

Advertisement
Update: 2016-02-04 03:26 GMT
బాజీరావ్ మస్తానీ…. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన అద్భుత దృశ్యకావ్యం. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే నటించిన శృంగార ప్రేమకావ్యం. ఈ సినిమా విడుదలైన వెంటనే వసూళ్ల వర్షం కురిపించింది. అన్ని సెంటర్లలో బ్రహ్మాండంగా ఆడింది. దాదాపు 3వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అటు ఫిలింఫేర్ లో కూడా దీనికి 10 అవార్డులు వచ్చాయి. సో… సినిమా మేటర్ కంప్లీట్ అయింది. వసూళ్లు-అవార్డులు అన్నీ అందుకున్న ఆ సినిమా కథ కంచికి చేరింది. కానీ దానిపై కేసులు మాత్రం ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టులో బాజీరావ్ మస్తానీపై కేసు పడింది. స్వయంగా బాజీరావ్ మస్తానీ వారసులు ఈ కేసు వేశారు. సినిమా విడుదలై అంతా అయిపోయిన తర్వాత… ఆ కథను తమకెందుకు చెప్పలేదని నిలదీస్తూ వారసులు కేసు వేశారు. సినిమాతో తమ కుటుంబ ప్రతిష్టకు తీరని నష్టం వాటిల్లిందని ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు దర్శకుడికి నోటీసులు జారీచేసింది.
Tags:    
Advertisement

Similar News