బంగారు రాజధానికి కేంద్రం బాస‌ట‌ : నిర్మల‌

ఆంధ్రప్రదేశ్‌ బంగారు రాజధాని నిర్మాణానికి కేంద్రం ఖచ్చితంగా సహాయం అందిస్తుందని, అందకు తాము తీవ్రంగా కృషి చేస్తామని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానాలు, అనవసర చర్చలు అవసరం లేదని స్పష్టం చేశారు. రాజధాని భూమిపూజ జరిగిన ఈ రోజును చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించాల్సిన రోజు అని అభివర్ణించారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ధన్యవాదాలు తెలిపారు. రాజధాని భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం […]

Advertisement
Update: 2015-06-06 01:38 GMT
ఆంధ్రప్రదేశ్‌ బంగారు రాజధాని నిర్మాణానికి కేంద్రం ఖచ్చితంగా సహాయం అందిస్తుందని, అందకు తాము తీవ్రంగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానాలు, అనవసర చర్చలు అవసరం లేదని స్పష్టం చేశారు. రాజధాని భూమిపూజ జరిగిన ఈ రోజును చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించాల్సిన రోజు అని అభివర్ణించారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ధన్యవాదాలు తెలిపారు. రాజధాని భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. భూమి పూజ రోజు చిరుజల్లులు పడటం మ‌రింత శుభ సూచికమని అన్నారు. శనివారం ఉదయం నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేసిన కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి పాల్గొన్నారు.
Tags:    
Advertisement

Similar News