మంత్రి కేటీఆర్ కు మళ్ళీ కరోనా

మంత్రి కేటీఆర్ కు మళ్ళీ కరోనా పాజిటీవ్ వచ్చింది. తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement
Update: 2022-08-30 12:37 GMT

తెలంగాణ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ కోవిడ్ కి గురయ్యారు. కరోనా లక్షణాలు కనబడడంతో పరీక్షలు చేయించుకున్నానని, దాంతో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని, ఇటీవల తనను కలిసినవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ఏడాది ఏప్రిల్ 23 న కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కోవిడ్ కి గురయ్యారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు.



Tags:    
Advertisement

Similar News