తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తెలంగాణలో ఉంటారా ? ఏపీకెళ్తారా ? ఈ రోజే తేలిపోతుంది

డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఆయన ఏపీకివెళ్ళాలా తెలంగాణలోనే ఉండాలా అనేది ఈ రోజు హైకోర్టు తేల్చనుంది.

Advertisement
Update: 2023-01-20 01:58 GMT

ఈ మధ్యే తెల‍ంగాణ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపించిన హైకోర్టు మరి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అదికారుల భవిష్య‌త్తును ఈ రోజు తేల్చనుంది. డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్‌ను సీఎం కేసీఆర్ నియమించారు.

ఈ రోజు ఆయన కూడా ఏపీకి వెళ్ళాలా తెలంగాణలోనే ఉండాలా అనేది  హైకోర్టు తేల్చనుంది. ఆయనతోపాటు 9 మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల క్యాడర్ అలాట్ మెంట్‌పై కూడా తెలంగాణ హైకోర్ట్ ఈ రోజు తీర్పు ఇవ్వనుంది.

ఐఏఎస్ అధికారుల్లో వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి తదితరులున్నారు.

వారం కిందట సోమేష్ కుమార్‌ను హైకోర్ట్ ఏపీకి పంపింది. సోమేశ్ స్థానంలో శాంతికుమారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.

Tags:    
Advertisement

Similar News