కల్వకుంట్ల కవితకు కరోనా

ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయ్యింది. ఈ మధ్య తనను కలిసిన వాళ్ళు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కవిత కోరారు.

Advertisement
Update: 2022-09-12 12:26 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోవిడ్ 19 పాజిటీవ్ గా తేలింది. గత రెండు, ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న తాను, పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్దారణ అయిందని ఆమె ట్వీట్ చేశారు.

గత కొన్ని రోజులుగా తనను‌ కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాక‌ కొన్ని రోజుల పాటు తాను హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఈ మధ్య కవిత సోదరుడు మంత్రి కేటీఆర్ కు కూడా కరోనా పాజిటీవ్ వచ్చి తగ్గిన విషయం తెలిసిందే. 


Tags:    
Advertisement

Similar News