మునుగోడులో ఎన్నికల ప్రచారం చేసిన గద్వాల అడిషనల్ ఎస్పీపై వేటు

ఉద్యోగానికి సెలవు పెట్టి మునుగోడులో ఎన్నికల ప్రచారం చేసిన గద్వాల అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై పోలీసు శాఖ వేటు వేసింది.

Advertisement
Update: 2022-11-06 08:15 GMT

గద్వాల  అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ పై డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి లీవ్ లో ఉన్న రాములు నాయక్ మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో బీజేపీ నేతలతో కలిసి సంస్థాన్ నారాయణపూర్ లో ప్రచారంలో పాల్గొన్నారు. మునుగోడులో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని కూడా రాములు నాయక్ కలిసినట్టు విచారణలో తేలింది. ఈ అంశంపై అడిషనల్ డీజీపీ జితేందర్ విచారణ జరిపారు. ఆ విచారణలో రాములు నాయక్ బీజేపీ తరపున ప్రచారం చేశారని తేలడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News