పవన్ కళ్యాణ్ కు అసెంబ్లీ సీటును ఆఫర్ చేసిన టీడీపీ నేత... తాను త్యాగం చేసి పవన్ ను గెలిపిస్తానన్న నాయకుడు

కొద్ది సేపటి క్రితం అనంత పురం తెలుగు దేశం నాయకుడు, అనంతపురం అర్బన్ అసెంబ్లీ సీటు ఆశిస్తున్న ప్రభాకర్ చౌదరి తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేస్తానని ప్రకటించాడు. అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ నిలబడతానంటే తాను మొత్తం భుజాల‌ మీద వేసుకొని ఆయనను గెలిపిస్తానని చెప్పాడు.

Advertisement
Update: 2023-01-08 07:58 GMT

ఒకవైపు హైదరాబాద్ లో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం జరుగుతుండగానే ఓ టీడీపీ నేత ఓ అడుగు ముందుకు వేసి, తాను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ కు తన సీటును ఇస్తానని ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను టీడీపీ స్పాన్సర్ చేస్తున్నదని, బాబు కనుసన్నల్లోనే పవన్ నడుస్తున్నాడని, అసలు చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య భేటీ జరుగుతున్న నేపథ్యంలో.... భేటీ పూర్తి కాక ముందే ఆ రెండు పార్టీలపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు,మంత్రి అమర్ నాథ్ తదితరులు ఆరోపణలు మొదలుపెట్టారు. ఒకవైపు వైసీపీ నాయకులు విమర్శలు ఎక్కుపెడుతుండగా మరో వైపు తెలుగు దేశం నాయకులు అప్పుడే రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయినట్టే మాట్లాడుతున్నారు.

కొద్ది సేపటి క్రితం అనంత పురం తెలుగు దేశం నాయకుడు, అనంతపురం అర్బన్ అసెంబ్లీ సీటు ఆశిస్తున్న ప్రభాకర్ చౌదరి తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేస్తానని ప్రకటించాడు. అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ నిలబడతానంటే తాను మొత్తం భుజాల‌ మీద వేసుకొని ఆయనను గెలిపిస్తానని చెప్పాడు. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Tags:    
Advertisement

Similar News