దేశంలో ఇవే చివరి ఎన్నికలు - ఖర్గే

ప్రజాస్వామ్యానికి 2024 ఎన్నికలు చివరివంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఖర్గే. బీజేపీతోపాటు ఆ పార్టీ గురువు RSS దేశ ప్రజల్లో విషం నింపుతుందన్నారు.

Advertisement
Update: 2024-01-29 15:05 GMT

AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ మళ్లీ గెలిస్తే.. దేశానికి ఇవే చివరి లోక్‌సభ ఎన్నికలు అవుతాయన్నారు. బీజేపీ గెలిచినా.. మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయినా.. దేశంలో మళ్లీ ఎన్నికలు జరగవన్నారు ఖర్గే. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరహాలో జీవితాంతం ఆయనే ప్రధానిగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారని ప్ర‌జ‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు ఖర్గే.

ప్రజాస్వామ్యానికి 2024 ఎన్నికలు చివరివంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఖర్గే. బీజేపీతోపాటు ఆ పార్టీ గురువు RSS దేశ ప్రజల్లో విషం నింపుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీ గెలిచినట్లయితే.. ఆ తర్వాత నియంతృత్వం వస్తుందని.. ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారాయన.

ఇండియా కూటమి నుంచి ఒక వ్యక్తి బయటకు వెళ్లిపోయినంత మాత్రాన.. కూటమి బలహీనపడదన్నారు ఖర్గే. నితీశ్‌ కూటమి నుంచి వెళ్లిపోవడం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపదన్నారు. బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News