అజిత్ హిట్ కొడితే దిల్ రాజుకి ట్రోల్స్..!

దిల్ రాజు కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న అజిత్ ఫ్యాన్స్ ఆయన్ను విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 11న విజయ్ వారసుడు, అజిత్ తునివు సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి.

Advertisement
Update: 2023-01-13 15:54 GMT

తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్‌ నటించిన తునివు మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగు నిర్మాత దిల్ రాజును అజిత్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. దిల్ రాజు తాజాగా తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్ తో వారసుడు అనే సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 11వ తేదీన తమిళనాడులో విడుదలైంది. ఈ సినిమా తెలుగు వర్షన్ రేపు విడుదల కావలసి ఉంది. కాగా, 11వ తేదీనే అజిత్ హీరోగా నటించిన తునివు కూడా రిలీజ్ అయింది. అయితే వారసుడు ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళనాడులో విజయ్ నంబర్ 1 హీరో అని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

నిజానికి కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోలు విజయ్, అజిత్. రజినీ తర్వాత టాప్ ప్లేస్ కోసం వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విజయ్, అజిత్ కు క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎటువంటి ఫ్యాన్ వార్ జరుగుతుందో తమిళనాడులో విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య కూడా అటువంటి ఫ్యాన్ వార్ జ‌రుగుతూ ఉంటుంది. కోలీవుడ్ లో ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో విజయ్ నంబర్ 1 హీరో అని దిల్ రాజు కామెంట్ చేయ‌డం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

దిల్ రాజు కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న అజిత్ ఫ్యాన్స్ ఆయన్ను విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 11న విజయ్ వారసుడు, అజిత్ తునివు సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి. రెండు సినిమాలకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ అజిత్ నటించిన తునివు సినిమాకు ఫస్ట్ డే భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు రూ. 24.59 కోట్ల షేర్ రాబట్టగా, విజయ్ నటించిన వారసుడు రూ. 19.43 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇక రెండవ రోజు అజిత్ మూవీ రూ.14.32 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. విజయ్ మూవీ కేవలం రూ.8.75 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. దిల్ రాజును ట్రోల్ చేస్తూ తమిళనాడులో నంబర్ వన్ హీరో ఎవరో ఇప్పుడు చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజును టార్గెట్ చేస్తూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    
Advertisement

Similar News