నడిరోడ్డుపై ప్రజల సమక్షంలో మహిళా ఎమ్మెల్సీకి చెంప దెబ్బ

ప్రజలందరూ చుట్టూ ఉండగా, పక్కనే భద్రతా సిబ్బంది, అనుచరులు ఉన్న సమయంలో ఎమ్మెల్సీపై దాడి జరగడంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది అతడిని పక్కకు తోసేశారు.

Advertisement
Update: 2023-02-09 14:55 GMT

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్సీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రజలతో మాట్లాడుతుండగా.. అంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను పక్కకు లాగి అందరూ చూస్తుండగా చెంప దెబ్బ కొట్టాడు. ఊహించని ఈ పరిణామానికి ఎమ్మెల్సీ సహా చుట్టూ ఉన్నవారు నిశ్చేష్టులయ్యారు. దీనిపై ఎమ్మెల్సీ అందజేసిన ఫిర్యాదు మేరకు ఆమెపై దాడి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

మహారాష్ట్ర హింగోలి జిల్లాలో దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ సావత్ సతీమణి, ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్ బుధవారం సాయంత్రం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతుండగా గుంపులో ఉన్న ఓ 40 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి ఎమ్మెల్సీని పక్కకు లాగి చెంప దెబ్బ కొట్టాడు.

ప్రజలందరూ చుట్టూ ఉండగా, పక్కనే భద్రతా సిబ్బంది, అనుచరులు ఉన్న సమయంలో ఎమ్మెల్సీపై దాడి జరగడంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది అతడిని పక్కకు తోసేశారు. జరిగిన ఘటనపై ప్రజ్ఞా సాతవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    
Advertisement

Similar News