ఘోర ప్ర‌మాదం.. 52 మంది స‌జీవ ద‌హ‌నం

జొహాన్నెస్‌బ‌ర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. గురువారం తెల్ల‌వారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జ‌ర‌గ‌డంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.

Advertisement
Update: 2023-08-31 08:51 GMT

దక్షిణాఫ్రికాలో గురువారం జ‌రిగిన భారీ అగ్ని ప్ర‌మాదంలో 52 మంది సజీవ దహనమయ్యారు. ఆ దేశంలోనే అతిపెద్ద నగరమైన జొహాన్నెస్‌బ‌ర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. గురువారం తెల్ల‌వారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జ‌ర‌గ‌డంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జొహాన్నెస్‌బ‌ర్గ్‌లోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఓ భవనంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జ‌రిగింది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాగా.. భవనమంతా దట్టమైన పొగ అలుముకొని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 52 మృతదేహాలను గుర్తించామని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. మరో 43 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు.


Tags:    
Advertisement

Similar News