బస్‌లో పరిచయం.. లాడ్జ్‌కి తీసుకెళ్లి బంగారం కొట్టేసింది

బస్సు ప్రయాణంలోనే వ్యక్తిని ముగ్గులోకి లాగిన సదరు మహిళ.. అతడిని శ్రీకాళహస్తిలోని ఒక లాడ్జ్‌కి తీసుకెళ్లింది. అతడితో గడిపిన అనంతరం ఆహారంలో మత్తు మందు ఇచ్చింది.

Advertisement
Update: 2022-12-12 04:52 GMT

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కిలాడి లేడీ ఘరానా మోసానికి పాల్పడింది. బస్పు ప్రయాణంలో ఒక వ్యక్తికి దగ్గరైన మహిళ అతడిని నమ్మించి నిండా ముంచేసింది. ఏకంగా ఆరు లక్షల రూపాయల విలువైన బంగారాన్ని కాజేసింది.

బస్సు ప్రయాణంలోనే వ్యక్తిని ముగ్గులోకి లాగిన సదరు మహిళ.. అతడిని శ్రీకాళహస్తిలోని ఒక లాడ్జ్‌కి తీసుకెళ్లింది. అతడితో గడిపిన అనంతరం ఆహారంలో మత్తు మందు ఇచ్చింది. సదరు వ్యక్తి నిద్రలోకి జారుకోగానే అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. 20వేల నగదు, సెల్‌ఫోన్ కూడా తీసుకెళ్లింది. ఆ మ‌త్తు నుంచి తేరుకొని చూసుకున్న సదరు వ్యక్తి మోసపోయినట్టు గ్రహించాడు.

పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లాడ్జ్ సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సదరు మహిళ కోసం అన్వేషిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News