Adipurush - పీపుల్ మీడియా చేతికి ఆదిపురుష్

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీ తెలుగు హక్కులను పీపుల్ మీడియా బ్యానర్ దక్కించుకుంది

Advertisement
Update: 2023-05-29 05:26 GMT

Adipurush Pre-release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు

ప్రభాస్-పీపుల్ మీడియా మధ్య బంధం రోజురోజుకు మరింత దృఢంగా మారుతోంది. ప్రస్తుతం వీళ్లు ప్రభాస్ తో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే, ప్రభాస్-టీ-సిరీస్ కాంబోలో రావాల్సిన స్పిరిట్ సినిమాలోకి కూడా ఎంటరయ్యారు.

టీ-సిరీస్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రావాల్సిన సినిమాకు యూవీ క్రియేషన్స్ సహ-నిర్మాత. యూవీ వాళ్లు తప్పుకోవడంతో, ఆ స్థానంలోకి పీపుల్ మీడియా వచ్చి చేరింది.

ఇప్పుడు ప్రభాస్ కు చెందిన మరో ప్రాజెక్టులోకి కూడా పీపుల్ మీడియా చేరింది. అదే ఆదిపురుష్. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఆదిపురుష్ తెలుగు రైట్స్ ను పీపుల్ మీడియా దక్కించుకుంది. దాదాపు 170 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కుల్ని పీపుల్ మీడియా దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ ను రిలీజ్ చేయడంతో పాటు.. తెలుగు నాన్-థియేట్రికల్ రైట్స్ ను కూడా పీపుల్ మీడియా దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైంది. నైజాం నుంచి 80 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News