Mahesh Babu: రమేష్ బాబు పిల్లలతో మహేష్ బాబు

Mahesh Babu: రమేష్ బాబు పిల్లలతో మహేష్ బాబు దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రమేష్ బాబు కొడుకు ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.

Advertisement
Update: 2022-11-18 11:03 GMT

కృష్ణ కుటుంబానికి ఇప్పుడు మహేష్ బాబు ఒక్కడే పెద్ద దిక్కుగా మారాడు. ఈ ఏడాది ప్రారంభంలో అన్న రమేష్ బాబును, ఆ తర్వాత తల్లి ఇందిరాను, తాజాగా తండ్రి కృష్ణను పోగొట్టుకున్న మహేష్ బాబు.. ఇప్పుడు తన రెండు కుటుంబాలకు తానే పెద్ద అయ్యాడు. ఈ నేపథ్యంలో రమేష్ బాబు పిల్లలతో మహేష్ దిగిన ఫొటో వైరల్ గా మారింది.

కృష్ణ కన్నుమూసి 3 రోజులు అవుతుంది. ఈ సందర్భంగా మూడో రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు, కృష్ణ అభిమానులు హాజరయ్యారు. కృష్ణ ఫొటోకు దండలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రమేష్ బాబు కొడుకు, కూతురు తో కలిసి మహేష్ దిగిన ఫొటో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఇకపై రమేష్ బాబు పిల్లల్ని కూడా మహేష్ బాబే చూసుకోవాలంటూ అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం రమేష్ బాబు కొడుకు, కృష్ణ పెద్ద మనవడు జయకృష్ణ అమెరికాలో ఉంటున్నాడు. అక్కడ నటన, గుర్రపుస్వారి, డాన్స్ లో ట్రయినింగ్ తీసుకుంటున్నాడు. త్వరలోనే జయకృష్ణ తెలుగుతెరపైకి రాబోతున్నాడు. ఆ వ్యవహారాలన్నింటినీ మహేష్ బాబు స్వయంగా చూసుకుంటాడు.






Tags:    
Advertisement

Similar News