Aadi Pinishetty - ఆది సరసన హీరోయిన్ ఫిక్స్

Aadi Pinishetty Shabdam Movie - ప్రస్తుతం శబ్దం అనే సినిమా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇందులో హీరోయిన్ గా లక్ష్మీ మీనన్ ను తీసుకున్నారు.

Advertisement
Update: 2023-02-25 15:28 GMT

ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'వైశాలి' సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం 'శబ్దం'. 7జీ ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా లక్ష్మీ మీనన్ నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన లక్ష్మి మీనన్ ఇంటెన్స్ సీరియస్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.

గతంలో వైశాలి సినిమాకు సంగీతం అందించిన, తమన్ నే ఈ సినిమా కోసం కూడా తీసుకున్నారు. అప్పుడు తమన్ ఓ సంగీత దర్శకుడు మాత్రమే. కానీ ఇప్పుడు అతడు స్టార్ కంపోజర్ అయ్యాడు. అయినప్పటికీ, వైశాలి యూనిట్ తో ఉన్న అనుబంధంతో శబ్దం సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది శబ్దం సినిమా. ఇందులో సరికొత్తగా కనిపించబోతున్నాడు ఆది పినిశెట్టి. అతడి కెరీర్ లో ఈ సినిమా మరో వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని చెబుతున్నారు మేకర్స్.

Tags:    
Advertisement

Similar News