నితిన్ లో అమాయకత్వం ఇష్టం - కృతి శెట్టి

నితిన్ ను అమాయకుడు అంటోంది హీరోయిన్ కృతి శెట్టి. ఆమె ఎందుకలా రియాక్ట్ అయిందో తెలుసా?

Advertisement
Update: 2022-08-07 02:53 GMT

Macherla Niyojakavargam OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో హిట్

రీసెంట్ గా రామ్ తో కలిసి వారియర్ సినిమాతో థియేటర్లలోకొచ్చిన హీరోయిన్ కృతి శెట్టి, ఇప్పుడు నితిన్ తో కలిసి థియేటర్లలోకి రాబోతోంది. నితిన్-కృతి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ షేడ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రచారం కల్పించేందుకు మీడియా ముందుకొచ్చింది కృతి శెట్టి. ఈ సందర్భంగా నితిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

"నితిన్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం కూడా ఉంది. 20 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. నన్ను కూడా దీవించండని కోరాను. జయం సినిమాలో ఎలా ఉన్నారో.. 20 ఏళ్ల తర్వాత కూడా ఆయన అంతే ఫ్రెష్ గా ఉన్నారు. ఆయన నిజాయితీ, అమాకత్వం వల్లనే ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను."

ఇలా నితిన్ ను అమాయకుడు, నిజాయితీపరుడు అంటూ మెచ్చుకుంది కృతి శెట్టి. మాచర్ల నియోజకవర్గం కథపై స్పందిస్తూ.. "కథ గురించి అప్పుడే ఎక్కువ చెప్పకూడదు గానీ.. నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది. చాలా అద్భుతమైన కథ. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. పొలిటికల్ టచ్ తో పాటు మంచి సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మంచి ప్యాకేజీగా ఉంటాయి." అంటూ తెలిపింది.

12వ తేదీన థియేటర్లలోకి వస్తోంది మాచర్ల నియోజకవర్గం. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఓ మాస్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


Full View


Tags:    
Advertisement

Similar News