Guntur Kaaram: షూటింగ్ ఇంకా ఉందా?

Guntur Kaaram: మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఇప్పుడీ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Advertisement
Update: 2023-12-24 16:00 GMT

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోంది గుంటూరు కారం సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ అంతా అనుకున్నట్టు జరుగుతోంది. ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఈనెల 28 నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయబోతున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ డెడ్ లైన్ ను అందుకోవాలంటే రాత్రిపగలు పనిచేయాల్సిందే. ప్రస్తుతం యూనిట్ అదే పనిలో ఉంది. ప్రస్తుతానికైతే అంతా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది.

వచ్చే వారాంతంలో మహేష్ న్యూ ఇయర్ ట్రిప్‌కు వెళ్లి జనవరి 5న తిరిగి వస్తారని సమాచారం. జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా అదే తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఈ గ్యాప్‌లో సినిమా నుంచి ఓ పాటను విడుదల చేయాలని భావిస్తున్నారు.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

Tags:    
Advertisement

Similar News