Pareshaan - అప్పుడు భయపెట్టాడు, ఈసారి నవ్విస్తాడంట

Thiruveer pareshaan - పరేషాన్ సినిమా అందరికీ నవ్వులు పంచుతుందంటున్నాడు తిరువీర్. కావాలని కామెడీ పెట్టలేదని, సహజంగానే పుడుతుందని అంటున్నాడు.

Advertisement
Update: 2023-05-30 12:16 GMT

‘మసూద’తో బిగ్ హిట్ అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ఇప్పుడు రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ‘పరేషాన్’అనే హిలేరియస్ ఎంటర్‌ టైనర్‌ తో వస్తున్నారు. వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మసూదతో భయపెట్టిన తిరువీర్, పరేషాన్ తో నవ్వులు పంచుతానని అంటున్నాడు.

"పరేషాన్ లో చాలా నేచురల్ కామెడీ ఉంటుంది. కావాలని చేసే కామెడీలా ఉండదు. అమాయకత్వం నుంచే హాస్యం పుడుతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా. సింగరేణి పోరగాళ్ళ కథ ఇది. మంచిర్యాల ఊరుని ఒక బయోపిక్ లా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ కథ."

ఇలా ఫుల్లుగా నవ్విస్తానని హామీ ఇస్తున్నాడు తిరువీర్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్పెషల్ షోలు వేశారు. విజయవాడ, కరీంనగర్, వరంగల్ లో షోలు వేశారు. ప్రతి చోటు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్నాడు తిరువీర్. తమది తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే అయినప్పటికీ, బెజవాడ నుంచి కూడా మంచి స్పందన వచ్చిందని చెబుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News