విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై స్ప‌ష్టమైన ప్రకటన‌ చేసిన‌ కేంద్రం

విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణ‌వ్ ప్రకటించారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు.

Advertisement
Update: 2022-09-28 12:15 GMT

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. కేంద్రం రైల్వే జోన్ ను ఏర్పాటు చేయబోవడం లేద౦టూ నిన్నటి నుండి వార్తలు వస్తున్న నేపథ్యం లో కేంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.

విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఒక వేళ జోన్ వద్దని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అందుకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేస్తామని అశ్విని వైష్ణవ్ అన్నారు.

కాగా విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం నిరాకరించినట్టు కొన్ని మీడియా సంస్థలు అపోహలు సృష్టిస్తున్నట్టు బీజేపీ రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లు మండిపడ్డారు. ఇది తప్పుడు ప్రచారమని, కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్దంగా ఉందని జీవీఎల్ అన్నారు. 

Tags:    
Advertisement

Similar News