విజయవాడలో క్రాకర్స్ షాప్ లో అగ్ని ప్రమాదం - ఇద్దరు సజీవ దహనం

విజయవాదలో బాణా సంచా షాపుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. విజయవాడ ,గాంధీ నగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపుల్లో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
Update: 2022-10-23 04:47 GMT

విజయవాదలో బాణా సంచా షాపుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. విజయవాడ ,గాంధీ నగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపుల్లో ఈ ప్రమాదం జరిగింది.

దీపావళి సందర్భంగా ప్రతీ సారీ ప్రమాదాలు జరుగుతున్నా జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. ఈ రోజు విజయవాడలో 3 క్రాకర్స్ షాపుల్లొ జరిగిన అగ్నిప్రమాదం ఇద్దరిని బలితీసుకుంది. పలువురికి గాయాలయ్యాయి.

విజయవాడ ,గాంధీ నగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపుల్లోని మూడు షాపుల్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ముందుగా ఒక షాపులో రేగిన అగ్ని మిగతా షాపులకు విస్తరించింది. దాంతో షాపుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మృతులను కాశీ, బ్రహ్మం లుగా గుర్తించారు. వీరిద్దరూ క్రాకర్స్ షాపుల్లో పని చేస్తున్నవారిగా తెలిసింది.

కాగా నిన్న రాత్రి తిరుపతి, విజయనగరంలలో కూడా క్రాకర్స్ షాపుల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Tags:    
Advertisement

Similar News