బాబుని కుప్పంలో అడ్డుకుంటాం

కుప్పంలోని షాహి గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రెండు వేలమందికి పైగా మహిళల సమస్యలు పరిష్కరించడంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌, స్థానిక ఎమ్మెల్యే అయిన బాబు విఫలమయ్యారని అంబేద్కర్ సేన నాయకులు ఆరోపించారు.

Advertisement
Update: 2022-08-22 09:13 GMT

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడుని కుప్పంలోనే అడ్డుకుంటామంటూ భారతీయ అంబేద్కర్ సేన హెచ్చరించింది. కుప్పంలోని షాహి గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రెండు వేలమందికి పైగా మహిళల సమస్యలు పరిష్కరించడంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌, స్థానిక ఎమ్మెల్యే అయిన బాబు విఫలమయ్యారని అంబేద్కర్ సేన నాయకులు ఆరోపించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళలకు కనీస వేతనాలు ఇప్పించాలని గత మే నెలలో కుప్పంలో ప‌ర్య‌టించిన‌ చంద్రబాబు నాయుడు కలిసి విన్నవించామన్నారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్న హామీని చంద్రబాబు విస్మ‌రించార‌ని ఆరోపించారు. మాటిచ్చి త‌ప్పినందుకు ఈనెల 24న కుప్పం వస్తున్న చంద్రబాబు నాయుడిని ఇక్కడే అడ్డుకుంటామని భారతీయ అంబేద్కర్ సేన నాయకులు హెచ్చ‌రించారు.

Tags:    
Advertisement

Similar News