బాలయ్య, మళ్లీ గోలయ్య.. వివరణతో మరింత వివాదం..

అక్కినేని కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ సుదీర్ఘ వివరణ ఇచ్చినా అందులో ఈ పార్ట్ మాత్రమే హైలెట్ అవుతోంది. అందులోనూ బాబాయ్ బాబాయ్ అంటూ నాగేశ్వరరావు గురించి చెప్పారే కానీ, నాగార్జున సహా ఇతర వారసుల గురించి బాలయ్య ఎక్కడా ప్రస్తావించలేదు.

Advertisement
Update: 2023-01-26 12:13 GMT

అక్కినేని-తొక్కినేని కామెంట్స్ తో బాలకృష్ణ రేపిన వివాదం ఈరోజు ఆయన వివరణతో సమసిపోయిందని అనుకున్నారంతా. కానీ అంతకంటే పెద్ద మంట పెట్టారు బాలయ్య. వివరణతో మరింత వివాదానికి కారణం అయ్యారు. అప్పుడేదో ఫ్లోలో మాట తూలారు అనుకుంటే, ఇప్పుడు ఏకంగా అక్కినేని సంతానంపైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టినట్టయింది. మొదట్లో వివరణ అని అందరూ సరిపెట్టుకున్నా, ఆ తర్వాత బాలయ్య వివరణలో ఆప్యాయత అనే పదం వైరల్ గా మారింది. ఆప్యాయత అక్కడలేదు, ఇక్కడ ఉంది అంటూ బాలయ్య చెప్పిన మాటల్లో కొంత భాగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కాంట్రవర్సీకంటే ఇదే పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. దీనిపై కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ గోల ఎందుకు..?

“నేనంటే నాగేశ్వరరావు బాబాయ్ కి చాలా ఇష్టం.. సొంత పిల్లల కంటే ఎక్కువగా నన్నే చూసుకొనేవారు. ప్రేమగా, ఆప్యాయంగా పలకరించేవారు.. ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు. ఇక్కడ ఉంది. అది గుర్తుపెట్టుకోండి” అంటూ నవ్వుతూ తన వివరణ ముగించారు. అక్కినేని కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ సుదీర్ఘ వివరణ ఇచ్చినా అందులో ఈ పార్ట్ మాత్రమే హైలెట్ అవుతోంది. అందులోనూ బాబాయ్ బాబాయ్ అంటూ నాగేశ్వరరావు గురించి చెప్పారే కానీ, నాగార్జున సహా ఇతర వారసుల గురించి బాలయ్య ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా ఆప్యాయత అక్కడ లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత మంట పెడుతున్నాయి.


నాగార్జున కుటుంబం ఏఎన్నార్ ను పట్టించుకోలేదా..? సరిగ్గా చూసుకోలేదా..? బాలయ్య అన్న మాటలకు అర్ధం ఏంటి..? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఒక వివాదం ముగిసిపోయింది అనుకుంటే బాలయ్య మరోసారి మాట తూలి ఇంకో వివాదం తీసుకొచ్చాడని అంటున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని ఈ వ్యాఖ్యలను హైలెట్ చేసినా, ఇప్పుడివి వైరల్ గా మారాయి, మరోసారి బాలయ్యను బోనులో నిలబెట్టాయి.

Tags:    
Advertisement

Similar News