గవర్నర్ ను కలసిన ఏపీ సమాచార కమిషనర్లు

అతి త్వరలో సాంవత్సరిక నివేదికను సమర్పిస్తామని గవర్నర్ కి విన్నవించారు కమిషనర్లు మహబూబ్ భాషా, శ్యామ్యూల్ జొనాధన్. రాజ్ భవన్ లో గవర్నర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Advertisement
Update: 2022-11-28 16:36 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్ గా ఆర్.మహబూబ్ భాషా, సమాచార కమిషనర్ గా పి.శ్యామ్యూల్ జొనాధన్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. విధుల్లో చేరిన అనంతరం వారు తొలిసారిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ భవిష్యత్ కార్యాచరణను వివరించారు.




 పాత్రికేయులుగా విశేష అనుభవం ఉన్న వీరిద్దరికీ ఇటీవల ప్రభుత్వం సమాచార కమిషన్ లో అవకాశం కల్పించింది. పాత్రికేయులుగా ప్రజా సమస్యల పట్ల విశేష అవగాహన కలిగి ఉన్న ఇద్దరూ ఇప్పుడు సమాచార కమిషన్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కాబోతున్నారు. పాత్రికేయ రంగంలో ఉన్న అనుభవంతో, సమాచార కమిషన్ ద్వారా గణనీయమైన సేవలు అందించాలని గవర్నర్ వారికి సూచించారు.

త్వరలో సాంవత్సరిక నివేదిక..

అతి త్వరలో సాంవత్సరిక నివేదికను సమర్పిస్తామని గవర్నర్ కి విన్నవించారు కమిషనర్లు మహబూబ్ భాషా, శ్యామ్యూల్ జొనాధన్. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News